Header Banner

చంద్రబాబు కీలక ప్రకటన! ఏపీలో మరో కొత్త ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్!

  Sat May 03, 2025 09:39        Politics

ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం కొత్తగా ఐదు ఎయిర్‌పోర్టులు నిర్మించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంల ఏడు ఎయిర్‌పోర్టులు ఉండగా.. మరో ఏడుచోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ క్రమంలోనే ఐదు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం త్వరలోనే ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మించి ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఐదుచోట్ల కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఈ ఐదు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలన జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో త్వరలోనే కొత్త ఎయిర్‌పోర్టు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఆత్మకూరులో 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. త్వరలోనే దగదర్తిలో విమానాశ్రయం ప్రారంభిస్తామని తెలిపారు. ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రామాయపట్నంలో 95 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. అలాగే ఐదు వేల కోట్ల వ్యయంతో ఎల్జీ పరిశ్రమ కూడా రానున్నట్లు వివరించారు. దీని ద్వారా పదివేల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. మరోవైపు కార్మికుల కోసం కర్నూలు, గుంటూరులో వందపడకల సామర్థ్యంతో ఆస్పత్రులు నిర్మిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. 175 నియోజకవర్గాల్లోనూ 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను చేస్తామని ప్రకటించారు.

మరోవైపు నెల్లూరు నగరానికి సుమారు 25 కి.మీ. దూరంలో దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందాయి. దగదర్తి విమానాశ్రయం కోసం 1,352 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటివరకు సుమారు 1,100 ఎకరాలు సేకరించారు.మిగిలిన 252 ఎకరాలకు సంబంధించి భూ వివాదాల కారణంగా పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోంది. 2020 నాటికి ఈ ఎయిర్‌పోర్టును పూర్తి చేయాలని భావించినప్పటికీ.. డీపీఆర్ తయారీ, భూసేకరణ వంటి కారణాలతో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం 2027 నాటికి దగదర్తి ఎయిర్‌పోర్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంన నుంచి పూర్తి స్థాయి సహకారం అందుతున్న నేపథ్యంలో గడువులోగా విమానాశ్రయం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #dagadarti #nelloreairport #apairport #newairport #apnews #chandrababu